'సన్ ఆఫ్ సత్యమూర్తి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, విడుదలకు ముందు టీజర్తో అందర్నీ ఎట్రాక్ట్ చేసేశాడు. ట్రైలర్కి ముందుగా టీజర్ని రిలీజ్ చేస్తారు. దానికన్నా ముందు ఫస్ట్ లుక్ వస్తుంది. టీజర్కి ముందు ఇంకో ప్రీ టీజర్ని రిలీజ్ చేసి కొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టారు 'సన్ ఆఫ్ సత్యమూర్తి' చిత్ర దర్శక నిర్మాతలు. అల్లు అర్జున్, రాజేంద్రప్రసాద్, కన్నడ నటుడు ఉపేంద్ర, నిత్యామీనన్, సమంత, ఆదా శర్మ, కోట శ్రీనివాసరావు.. ఇలా భారీ తారాగణం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 'విలువలే ఆస్తి' అనే ట్యాగ్లైన్తో 'సత్యమూర్తి' ప్రమోషన్ని ఎట్రాక్టివ్గా తీర్చిదిద్దారు. కుటుంబ కథా చిత్రాన్ని ఈ ట్రెండ్కి తగ్గట్టుగా తీయడమెలాగో 'అత్తారింటికి దారేది'తో చూపించిన త్రివిక్రమ్, మళ్ళీ అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు 'సన్ ఆఫ్ సత్యమూర్తి'.అన్ని వర్గాల్నీ ఆకర్షించేలా సినిమా రూపొందిందన్న ప్రచారంతో టాక్ ఆఫ్ ది టాలీవుడ్గా 'సన్ ఆఫ్ సత్యమూర్తి' మారింది. త్రివిక్రమ్ న్యూ కాన్సెప్ట్కి, అల్లు అర్జున్ తన స్టైలిష్ లుక్ని యాడ్ చేసి 'సన్ ఆఫ్ సత్యమూర్తి' సినిమాపై అంచనాల్ని రెట్టింపు చేసేశాడు. ప్రీ ట్రీజర్ ఈ టాక్ ఉంటే, ట్రెయిలర్ వచ్చాక టాక్ ఇంకెలా ఉంటుందో.
|