తెలుగు సినిమాల్లో తెలుగమ్మాయిలకు అవకాశాలు తక్కువనే అపప్రధ ఉన్నా, కొంచెం కొంచెంగా తెలుగు హీరోయిన్లకు తెలుగు సినిమాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. తమిళంలో హీరోయిన్గా గుర్తింపు పొంది, తెలుగులో స్టార్ హీరోయిన్గా మన్ననలు అందుకుంటున్న అంజలి, అదే తమిళ సినిమాలనుండి తెలుగు సినిమాల్లో పాపులర్ అయిన స్వాతి అవకాశాల్ని అంది పుచ్చుకుంటున్నారు.
హీరోయిన్ సెంట్రిక్ మూవీ ‘గీతాంజలి’తో అంజలి ఆకట్టుకోగా, స్వాతి కూడా ‘త్రిపుర’ అనే థ్రిల్లర్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించనుంది. ‘గీతాంజలి’ ఫేమ్ రాజకిరణ్ ఈ చిత్రానికి దర్శకుడు. టైటిల్ రోల్లో స్వాతి పవర్ఫుల్గా కనిపించనుందని చిత్ర దర్శకుడు చెబుతున్నాడు. స్వాతి గొప్ప నటి అనీ, ఆమె నటనలోని డిఫరెంట్ యాంగిల్ ఈ సినిమా ద్వారా ఆవిష్కరించబోతున్నామని ఆయన చెప్పారు.
ఏప్రిల్ 6న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా సినిమా ప్రారంభం కానుంది. ఏప్రిల్ 13 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. తెలుగుతోపాటు తమిళంలో కూడా సినిమాని విడుదల చేసేందుకు దర్శకుడు, నిర్మాత ఆలోచన చేస్తున్నారట. ‘త్రిపుర’ సినిమాతో నటిగా స్వాతి మరో మెట్టు పైకెక్కుతుందని నిర్మాతలు ఘంటాపథంగా చెబుతున్నారు.
|