అయ్యయ్యో త్రిష, బ్రేకప్ అయిపోయిందిగా అనే సందేశాలు సోషల్ మీడియాలో గిరగిరా తిరుగుతున్నాయి. వరుణ్ మణియన్ అనే తమిళ నిర్మాత, వ్యాపారవేత్తతో త్రిష కొన్నాళ్ళుగా ఎఫైర్ నడుపుతోంది. ఆ ఎఫైర్కి ముగింపు పలికి, ఇద్దరూ వైవాహిక బంధం ద్వారా ఒక్కటవ్వాలనుకున్నారు. ఇరువు పెద్దలూ పెళ్ళికి అంగీకరించారు. ఈలోగా ఏమయ్యిందో త్రిషకీ వరుణ్కీ మధ్య విభేదాలు తలెత్తాయి. అంతలోనే బ్రేకప్ గాసిప్స్ కూడా వచ్చాయి. ‘అదంతా రూమర్ మాత్రమే’ అని బ్రేకప్ ప్రచారంపై త్రిష, వరుణ్ కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చినా, ‘బ్రేకప్ వివాదం’ దాగలేదు. త్రిష స్వయంగా బ్రేకప్ వార్తల్ని నిజమని ప్రకటించేసింది. ‘సింగిల్గా హ్యాపీగా ఉన్నాను’ అని ట్విట్టర్లో త్రిష ప్రకటించడంతో ఇప్పుడంతా క్లియర్. త్రిష ఇక నుంచి సినిమాల్లో బిజీ అవుతుందట. ‘లయన్’ సినిమా విడుదల కోసం త్రిష కోటి ఆశలతో ఎదురుచూస్తోంది. బాలయ్య హీరోగా నటించిన ‘లయన్’ సినిమా మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
|