ఒకదాని తర్వాత ఒకటి ‘బాహుబలి’ గెటప్స్ని రివీల్ చేస్తున్నాడు ‘జక్కన్న’ రాజమౌళి. ప్రభాస్, రమ్యకృష్ణ, నాజర్ గెటప్స్ తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంవమయ్యాయి. దేనికదే సూపర్బ్ అనేలా ఒక్కో పాత్రకీ ఫస్ట్ లుక్ని ఆడియన్స్కి రివీల్ చేసిన జక్కన్న, సినిమా ట్రైలర్ని మే 31న విడుదల చేస్తాడు. దీనికోసం భారీ ఏర్పాట్లూ జరుగుతున్నాయట. అదే రోజు సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమం కూడా ఉంటుందని సమాచారం. ఫస్ట్ లుక్ పోస్టర్స్కే ఎంతో జాగ్రత్త తీసుకున్న రాజమౌళి, ట్రైలర్ కోసం ఇంకెన్నో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాడంటున్నారు. తెలుగు సినీ పరిశ్రమలోనే అత్యంత భారీగా ‘బాహుబలి’ రూపొందుతోంది. బడ్జెట్, స్టార్ కాస్టింగ్, క్వాలిటీ వంటి అంశాల్లో ఎక్కడా రాజీ పడకుండా ‘బాహుబలి’ని దర్శకుడు రాజమౌళి తెరకెక్కించాడు. ప్రభాస్, అనుష్క, రాణా ప్రధాన పాత్రల్లో కన్పించనున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, నాజర్ లాంటి ప్రముఖులెందరో కనిపిస్తారు. బాహుబలిని రెండు పార్టులుగా విడుదల చేయనుండడం ఇంకో ఆసక్తికరమైన అంశం. ఇన్ని ఆసక్తికరమైన అంశాలున్న ‘బాహుబలి’ ట్రైలర్ కోసం ఆడియో కోసం బీ రెడీ.
|