మహేష్తో ‘వన్ నేనొక్కడినే’ సినిమాలో హీరోయిన్గా నటించిన కృతి సనన్కి కెరీర్ మొదటినుంచీ ఎన్నో కాంప్లిమెంట్స్తోపాటు, విమర్శలు కూడా వస్తున్నాయట. ‘ఇంకొంచెం అందంగా ఉంటే బాగుండేది. ఇంకొంచెం బాగా చేసి ఉంటే బాగుండేది’ అని అంటుండడం తనకు అస్సలు ఇష్టం ఉండదని కృతి హాసన్ అసహనం వ్యక్తం చేస్తుంది. సినీ రంగంలో కాంప్లిమెంట్స్ మాత్రమే కాకుండా, కామెంట్స్ కూడా వస్తుంటాయి. క్రిటిక్స్ నుంచి భళా అనిపించుకోవడం నటీనటులకు చాలా గొప్ప విషయం. విమర్శల్ని స్వీకరించి, తమను కొత్తగా మలచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కృతిహాసన్ కూడా విమర్శలను స్వీకరిస్తానంటూనే, అవి తనకు నచ్చవని చెప్పడం ఆశ్చర్యకరంగానే అనిపిస్తుంటుంది. తెలుగులో కృతి సనన్ చేసినవి రెండే సినిమాలు. ఒకటి ‘1 నేనొక్కడినే’ అయితే, ఇంకొకటి ‘దోచెయ్’. రిలీజ్ అయిన వెంటనే ‘దోచెయ్’కి మంచి టాక్ వచ్చినా, సినిమా సేఫ్ వెంచర్ కాలేకపోయింది. కెరీర్లో నిలదొక్కుకోవాలంటే కృతిసనన్ ఎంతో కష్టపడాల్సి ఉంది.
|