‘పూలరంగడు’ సినిమాతో దర్శకుడిగా మంచి మార్కులేయించుకున్న వీరభద్రం చౌదరి, సాయికుమార్ తనయుడు ఆది హీరోగా ‘చుట్టాలబ్బాయ్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సినిమా ‘అహనా పెళ్ళంట’ తర్వాత, ఆదితోనే సినిమా చేయాల్సి ఉందనీ, మొదట ‘పూలరంగడు’ కథని ఆదికే చెప్పినప్పటికీ కొన్ని కారణాలతో సునీల్ హీరోగా ఆ సినిమా తెరకెక్కించాల్సి వచ్చిందన్నాడు వీరభద్రం చౌదరి. ఆదికి తగ్గ కథతో ఆడియన్స్ని కడుపుబ్బా నవ్వించే ఎంటర్టైన్మెంట్తో, ఆదికి సూటయ్యే యాక్షన్ ఇమేజ్తో సినిమాని తీర్చిదిద్దనున్నామని దర్శకుడు చెప్పాడు. వినోదం, యాక్షన్ కలగలిస్తే ఏ సినిమా అయినా హిట్టేననీ, ఆదితో సినిమా ఖచ్చితంగా హిట్టవుతుందని ధీమా వ్యక్తం చేశాడు దర్శకుడు వీరభద్రం చౌదరి. 2015లో వచ్చే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా ‘చుట్టాలబ్బాయ్’ నిలుస్తుందని దర్శక నిర్మాతలు నమ్మకంతో చెప్పారు. హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు. తమన్ సంగీతం అందిస్తాడు ఈ ‘చుట్టాలబ్బాయ్’కి.
|