సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రాజ్తరుణ్ హీరోగా 'కుమారి 21 ఎఫ్' సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ సమర్పిస్తున్న ఈ సినిమాలో రాజ్తరుణ్ సరసన హెబ్బా పటేల్ హీరోయిన్గా నటిస్తోంది. 'సినిమా చూపిస్త మావా' సినిమాతో రాజ్ తరుణ్ అల్లరబ్బాయిగా మామగారిని ఆటపట్టించే పాత్రలో చాలా నాచురల్గా నటించి ప్రేక్షకులకు కావల్సిన వినోదాన్ని అందించి మెప్పించాడు.
ఇప్పుడు ఈ సినిమాలో అల్లరి చిల్లరిగా తిరుగుతూ అనుకోకుండా అమ్మాయి ప్రేమలో పడి ఆమె పెట్టే పరీక్షలను తట్టుకుని ఎలా ఆ కుమారి ప్రేమను పొందే ప్రేమికుడి పాత్రలో కనిపించనున్నాడు రాజ్ తరుణ్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఈ నెల 31న విడుదల అవుతాయి. దర్శకుడిగా విభిజన్నమైన చిత్రాల్ని తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ అనిపించుకున్న సుకుమార్, నిర్మాతగా మారి తీస్తున్న ఈ సినిమా ఏ స్థాయి విజయం అందుకుంటుందో చూడాలిక.
|