ఛార్మి ప్రధాన పాత్రలో రూపొంది ‘జ్యోతిలక్ష్మి’ సినిమా థియేటర్లలోంచి వెళ్ళిపోతున్నా, ఆ సినిమాని జనంలో నిలబెట్టడానికి ఛార్మి ఎంతగానో కష్టపడుతోంది. బాగానే ఉంది, బాగుంది అనే ప్రశంసలు దక్కించుకున్న ఈ సినిమా ద్వారా దర్శకుడు పూరి జగన్నాథ్ సొసైటీకి ఇచ్చిన మెసేజ్, దానికి తోడు ఛార్మి ప్రమోషన్ సినిమాని ఇంకా వార్తల్లోనే ఉంచుతున్నాయి. ఛార్మి ఈ చిత్రంలో నటించడమే కాకుండా ఈ సినిమాకి సహ నిర్మాత కూడా కావడం పెద్ద ప్లస్ అయ్యింది. తన సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఛార్మి పడుతున్న కష్టం అభినందనీయం. సినీ, రాజకీయ ప్రముఖుల కోసం స్పెషల్ షోలు వేస్తూ, అభినందన సభలు చేపడుతూ ఛార్మి చాలా బిజీగా ఉంది. ‘మంత్ర’ తదితర సినిమాలతో వచ్చిన గుర్తింపు కన్నా, ఛార్మికి ‘జ్యోతిలక్ష్మి’తో ఎంతో గుర్తింపు వచ్చింది. కమర్షియల్ హీరోయిన్గా స్టార్డమ్ ఎప్పుడో సంపాదించుకున్న ఛార్మి, నటిగా, నిర్మాతగా ‘జ్యోతిలక్ష్మి’తో ఇంకా పెద్ద పేరు సంపాదించుకుంది. ‘జ్యోతిలక్ష్మి`2’ ఎప్పుడు చేద్దాం జగన్గారూ అని పూరి జగన్నాథ్ని అడుగుతూ అతనిపై ఒత్తిడి తెస్తున్న ఛార్మి, ఆ సినిమాతో కూడా హిట్ కొడితే, ఛార్మి ఇమేజ్ ఒకేసారి పదింతలు అయిపోతుంది.
|