అక్కినేని కుటుంబం నుంచి వస్తున్న కొత్త హీరో అఖిల్ అక్కినేని. నెలల వయసులోనే 'సిసింద్రీ'గా తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన అఖిల్, 'మనం' సినిమాలో మెరుపులా కాస్సేపు కనిపించాడు. పూర్తిస్థాయిలో హీరోగా మారి అఖిల్ చేస్తున్న సినిమా 'దసరా' బరిలో నిలుస్తుందట. వినాయక్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా, హీరో నితిన్ ఈ సినిమాతో నిర్మాతగా మారాడు. దసరా తెలుగు సినిమాకి రెండో పెద్ద పండుగ. ఈ సీజన్లో సినిమాని విడుదల చేస్తే అఖిల్కి పెద్ద ప్లస్ అవుతుందని అనుకుంటున్నారట. అలాగే మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కూడా దసరా బరిలోనే నిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారమ్. తెలుగు సినీ రంగంలో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ మధ్య పోటీ ఉండేది. నలుగురూ టాప్ 4 హీరోలుగా నిలదొక్కుకున్నారు. ఈ నలుగురిలో ఇద్దరు వారసులు దసరా బరిలో పోటీ పడ్తుంటే ఆ పోటీ రసవత్తరంగానే ఉంటుంది. చరణ్ తానేంటో ఇప్పటికే నిరూపించుకోగా, తొలి సినిమాతోనే బాక్సాఫీస్ని కొల్లగొట్టాలని చూస్తున్న అఖిల్కీ ఆల్ ది బెస్ట్.
|