'ఉయ్యాల జంపాల' సినిమాలాగానే 'సినిమా చూపిస్త మావ' సినిమాతో కూడా హిట్ కొట్టేస్తామంటున్నారు హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ అవికా గోర్. తొలి సినిమాతోనే ఈ జంట ఆన్ స్క్రీన్ మ్యాజిక్ చేసింది. డిఫరెంట్ అండ్ క్యూట్ పెయిర్గా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ జంట, 'సినిమా చూపిస్త మావ' సినిమాతో ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అవికతో వర్క్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుందనీ మళ్ళీ మళ్ళీ ఆమెతో నటించాలని ఉందని రాజ్తరుణ్ అంటున్నాడు. భాష తెలియని సమయంలో రాజ్ తరుణ్ తనకు బాగా హెల్ప్ చేశాడనీ, అలా 'ఉయ్యాల జంపాల' సినిమాతో మా స్నేహం చిగురించిందని చెబుతున్న అవికా గోర్, 'సినిమా చూపిస్త మావ' సినిమాలో మెచ్యూర్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చానని నమ్మకం వ్యక్తం చేసింది. నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో అంజిరెడ్డి, బబెక్కం వేణుగోపాల్ రూపేష్ డి.గోహిల్, జి. సునీత సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
|