విలక్షణ చిత్రాలు చేయడంలో విశ్వనటుడు కమల్హాసన్ తర్వాతే. సినిమా సినిమాకీ వ్యత్యాసాన్ని కోరుకోవడం కమల్హాసన్కే చెల్లింది. ఆ కోవలోనే 'చీకటి రాజ్యం' సినిమా వస్తోంది. రాజేష్. ఎం. సెల్వన్, ఎన్. చంద్రహాసన్ దర్శక నిర్మాతలుగా కమల్హాసన్, త్రిష జంటగా నటిస్తున్న చిత్రం 'చీకటి రాజ్యం'. సరికొత్త కథనాలతో అలరించే కమలహాసన్ మరో కొత్త కథనంతో ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఊహించని అనుభూతిని కలిగిస్తానంటున్నాడు.
చాలా తక్కువ రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ జరుపుకున్న చిత్రమిది. కేవలం నలభై రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుంది. నలుగురు పాత్రల చుట్టూ, ఒక్క రాత్రిలోనే జరిగే కథ ఇది. అబ్బూరి రవి అందించిన మాటలు బాగా ఆకట్టుకునేలా ఉంటాయట. తెలుగు, తమిళ భాషల్లో ఒకే సారి ఈ సినిమా విడుదల కానుంది. ప్రకాష్రాజ్, కిషోర్, సంపత్ కీలక పాత్రలు పోషించారు. సంగీతం జిబ్రాన్.
|