'ఎల్బి డబ్ల్యు' (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన ప్రవీణ్ సత్తారు, 'చందమామ కథలు' అనే మరో చిత్రం ద్వారా తన ఉనికిని చాటుకున్నాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ, నరేష్, విజయ్ కృష్ణ, రేష్మీ, శ్రద్ధాదాస్, మంచు లక్ష్మి, మహేష్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం 'గుంటూరు టాకీస్' విడుదలకు సిద్ధమవుతోంది.
ఎం. రాజ్ కుమార్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. 'జబర్దస్త్' టీవీ షో ఫేం రేష్మి, ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకుంది. పలు సినిమాల్లో నటించినా సరైన గుర్తింపు కోసం ఎదురుచూస్తోన్న శ్రద్ధాదాస్, ఈ సినిమాలో రివాల్వర్ రాణిగా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది.
ఈ సినిమాకి రివాల్వర్ రాణి పాత్ర ఎంతో కీలకమని దర్శకుడు అంటున్నాడు. శ్రద్ధాదాస్కి ఈ చిత్రం మంచి గుర్తింపు రావడం ఖాయమని ప్రవీణ్ సత్తారు అంటున్నాడు. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
|