కావలిసినపదార్ధాలు: పీతలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, కారం, గరమ్మసాలాపొడి, చింతపండు రసం, వెల్లిపాయలు
తయారుచేసేవిధానం: ముందుగా ఉల్లిగడ్డలను, కరివేపాకును, వెల్లుల్లిపాయలను, పచ్చిమిర్చిని కలిపి ముద్దగా తయారుచేయాలి. తరువాత బాణలిలో నూనె వేసి తయారుచేసిన ముద్దను నూనెలో వేసి బాగా వేగనివ్వాలి. తరువాత పసుపు, కారం, ఉప్పు వేసి పీతలను వేసి 10 నిముషాలు మూతపెట్టాలి. తరువాత చింతపండు రసాన్ని పోసి ఇంకా 5 నిముషాలు ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీర, గరమ్మసాల పొడిని వేయాలి. అంతే అంధ్రా స్టైల్ లో పీతలకూర రెడీ..!
|