రజనీ కాంత్, ఐశ్యర్య రాయ్ జంటగా నటించిన 'రోబో' సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఒక ట్రెండ్ సృష్టించింది. ఇప్పుడు ఇదే జంట పా రంజిత్ దర్శకత్వంలో 'కబలి' అనే సినిమా కోసం మరోమారు జత కట్టబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా రాధికా ఆప్టే పేరు ఖరారయ్యింది. ఇంకో హీరోయిన్ పాత్ర కోసం ఐశ్వర్యారాయ్ని సంప్రదించారట. ఐష్ కూడా రజనీకాంత్తో నటించడానికి ఓకే చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత 'రోబో 2' సీక్వెల్లో రజనీకాంత్ నటించబోతున్నాడు.
'రోబో'లో రజనీకాంత్తో ఐష్ జత కట్టడంతో 'రోబో' సీక్వెల్ కోసం కూడా ఐశ్వర్యతో కొన్ని సీన్లు చేయాల్సి ఉందట. దాంతో మరోమారు రజనీకాంత్తో ఐష్ నటించే అవకాశాలున్నాయి. 'రోబో' సీక్వెల్లో రజనీకాంత్కు హీరోయిన్గా అమీజాక్సన్ని ఎంపిక చేసుకున్నట్లు సమాచారమ్. ఇంతకు ముందు శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'ఐ' సినిమాలో నటించింది అమీ జాక్సన్. 'రోబో' సీక్వెల్లో ఐష్ నటించడం నిజమే అయితే, రజనీకాంత్తో మూడు సినిమాల్ని ఐష్ చేసినట్లవుతుంది.
|