'ఏం మాయ చేశావే' సినిమాతో నాగ చైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయ్యింది. 100 పర్సెంట్ లవ్', మనం, తడాఖాలాంటి సినిమాలతో విజయాలను తన ఖాతాలో వేసుకున్నప్పటికీ తండ్రికి తగ్గ కొడుకుగా ఇండస్ట్రీలో నిఖార్సయిన హిట్ కొట్టలేకపోయాడు. మళయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా 'ప్రేమమ్' రీమేక్లో నటించడానికి సిద్ధమవుతున్నాడు ఈ అక్కినేని హీరో. ఈ సినిమాలో చైతన్య పక్కన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది.శృతిహాసన్తో పాటు మరో ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా ఈ సినిమాలో చైతూ సరసన ఆడిపాడనున్నారట. చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి సూర్యదేవర వంశీ నిర్మాతగా వ్యవహారిస్తున్నారు. గతంలో నాగార్జునకు ఘన విజయాన్ని తెచ్చిపెట్టిన సూపర్గుడ్లవ్ స్టోరీ 'మజ్ను' టైటిల్నే ఈ సినిమాకు టైటిల్గా సెలెక్ట్ చేశారు.
అప్పట్లో నాగార్జునకు అంత మంచి పేరు తీసుకువచ్చిన ఆ సినిమా ఇప్పుడు తనకు కూడా తన కెరీర్లో ది బెస్ట్ మూవీ అవుతుందని చైతూ అనుకుంటున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్తేజ ఒక గెస్ట్ రోల్లో మెరవనున్నాడని సమాచారం. మ్యూజికల్ లవ్స్టోరీగా తెరెకెక్కబోతోన్న ఈ సినిమా వచ్చే నెల్లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే నాగచైతన్య హీరోగా నటిస్తున్న 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.
|