కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'శ్రీమంతుడు'. మహేష్బాబు, శృతిహాసన్ జంటగా నటించారు. సినిమా విడుదలై 100 రోజులు కావస్తోంది. విజయవంతంగా ధియేటర్లో ఆడుతూ ఇంకా ప్రేక్షకుల మన్ననలు పొందుతూనే ఉంది. ఈ సినిమా కేవలం సినిమా పరంగానే 'ఊరు దత్తత' అనే కాన్సెప్ట్తో చాలా మంది రియల్ శ్రీమంతుల దృష్టిలో పడింది. ఈ స్పూర్తితో కొందరు రాజకీయనాయకులు, బడా బాబులు కొన్ని కొన్ని ఊళ్లను దత్తత తీసుకుని సేవ చేయడంలో మునిగిపోయారు. అంతే కాక సినిమాలో మహేష్బాబు వాడిన సైకిలు కూడా చాలా డబ్బులు సంపాదించి, సేవా కార్యక్రమాలకు ఉపయోగపడుతోంది.
ఈ సైకిలు వేలం పాటలో వచ్చిన 15లక్షల రూపాయల్లో 10 లక్షలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి, మిగతా 5 లక్షల రూపాయలను హీల్ ఎ చైల్డ్ పౌండేషన్కు డొనేట్ చేశారు. ఈ కార్యక్రమానికి మహేష్ సతీమణి, నటి నమ్రత చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఆమె ఈ సేవా కార్యక్రమంలో తాను ఒక భాగం అయినందుకు ఎంతో సంతోషపడుతున్నానని చెప్పింది. ఒక నటిగా, సూపర్ స్టార్ భార్యగా ఇలాంటి సేవలను, మంచి పనులను ఎన్నో చేయాలని ఉందనీ, అందుకు అందరూ కూడా తమ వంతు సహకారం అందిస్తే బాగుంటుందని చెప్పింది.
|