Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
bunny is so talented person

ఈ సంచికలో >> సినిమా >>

చెన్నైకి మన సినీ స్టార్స్‌ చేయూత

tollywood help hands too chennai

వరదలతో అతలాకుతలం అవుతున్న చెన్నై నగరానికి టాలీవుడ్‌ సినీ తారలు మేమున్నామంటూ తమ వంతు సాయాన్ని అందించడానికి ముందుకొచ్చారు. అల్లు అర్జున్‌ 25 లక్షలు, ఎన్టీఆర్‌, మహేష్‌, రాంచరణ్‌ 10 లక్షల చొప్పున విరాళాలు ప్రకటించారు. వరుణ్‌ తేజ 3లక్షలు, నిర్మాత కోలగట్ల ప్రతాప్‌ లక్ష రూపాయలు తమిలనాడు ముఖ్యమంత్రి ప్రజా సహాయనిధికి విరాళంగా అందజేశారు. సంపూర్ణేష్‌బాబు 50 వేలు అందజేయనున్నట్లు తెలిపారు.

యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ తన ఇంటి నుంచి స్వయంగా 5వేల ఆహారపు పొట్లాలను చెన్నైకి తరలించారు. సాయిధరమ్‌ తేజ 3లక్షల విలువ గల ఆహార పదార్ధాలను, దుస్తులను చెన్నై వరద బాధితులకు పంపనున్నట్లు తెలిపారు. ఇంకా హీరో ప్రభాస్‌ 15 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. మిగిలిన సినీ లోకం కూడా తమ వంతు ఆర్ధిక సాయాన్ని అందించడానికి నడుం బిగించారు. ఇదే కాక వరద బాధితుల సహాయార్ధం ప్రత్యేక ఈవెంట్స్‌లాంటవి ప్లాన్‌ చేసే యోచనలో కూడా సినీ గణం ఉన్నట్లు తెలుస్తోంది. వరద బీభత్సం గురించి తెలుసుకున్న టాలీవుడ్‌ సినీతారలంతా ఇంటర్నెట్స్‌, ఫేస్‌బుక్స్‌లాంటి వాటి ద్వారా విచారాన్ని తెలియజేస్తున్నారు. తమిళ హీరోలూ ఇతోదికంగా విరాళాల్ని ఇప్పటికే ప్రకటించగా, హీరో విశాల్‌ స్వయంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటానని ప్రకటించాడు. 

మరిన్ని సినిమా కబుర్లు
bangal tiger ready to release