'అతడు' సినిమాతో నిరాశచెందిన శ్రీనువైట్ల, 'బ్రూస్లీ' కోసం ఎంతో కష్టపడ్డాడు. దురదృష్టవశాత్తూ 'బ్రూస్లీ' సినిమాతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు డైరెక్టర్ శ్రీను వైట్ల. దాంతో ఇండస్ట్రీలో ఎన్నో గాసిప్స్ వినిపించాయి. హిట్టొస్తే పొగిడేయడం, ఫ్లాపొస్తే విమర్శించడం సినీ రంగంలో మామూలే. అది శ్రీను వైట్లకి కూడా తెలుసు. ఈ టైమ్లో మంచి సక్సెస్ కొట్టి సత్తా చాటాలనుకుంటున్నాడు శ్రీనువైట్ల. పెర్ఫెక్ట్ ప్లానింగ్తో కసిగా సినిమా తీసి ఖచ్చితంగా హిట్ కొట్టాలని గట్టి పట్టు మీద ఉన్నాడట శ్రీనువైట్ల. ఇటీవలే శ్రీనువైట్ల ఒక కొత్త ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సి. కళ్యాణ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించనున్నారట.
త్వరలోనే ఈ సినిమాపై స్పష్టత రానుందని సమాచారమ్. 'దూకుడు' సినిమాతో శ్రీనువైట్ల ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఆ స్థాయి విజయాన్ని అందుకునేలా శ్రీనువైట్ల ప్లానింగ్ చేసుకుంటున్నాడట. కెరీర్లో అనేక విజయాల్లో తనతోపాటు ట్రావెల్ చేసిన కోన వెంకట్తో విభేదాల్ని పరిష్కరించుకుని, కొత్త ప్రాజెక్ట్ని పట్టాలెక్కించాలని శ్రీనువైట్ల నిర్ణయానికి వచ్చాడని అంటున్నారు. 'బ్రూస్లీ' కోసం కోన వెంకట్, శ్రీను వైట్ల విభేదాలు పక్కన పెట్టినట్లు కన్పించినా, ఆ విభేదాలు సినిమా విడుదలయ్యాక బయటపడ్డాయి. ఈసారి అలా కాకూడదని కోన, వైట్ల అనుకుంటున్నారట. అది నిజమైతే శ్రీను వైట్ల ఫామ్లోకొచ్చినట్లే.
|