బుల్లితెరకు యాంకర్గా పరిచయమైన అనసూయకు వెండితెరపై మెరవాలనే ఆశ ఈనాటిది కాదు. ఎప్పటినుండో ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ వచ్చింది. చివరికి నాగార్జున పుణ్యమా అని 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాతో ఆ కోరిక నెరవేరింది. ఈ సినిమాలో నిజంగానే తళుక్కున మెరిసింది ఈ ముద్దుగుమ్మ. హీరోయిన్లకు ధీటుగా అందంగా కనిపించింది. అంతేకాదు నాగ్తో రొమాన్స్ చేసే అవకాశం కూడా లభించింది. కనిపించింది కొంత సేపే అయినా పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఇప్పుడు మళ్లీ వెండితెరకు గ్లామర్ తెచ్చే పనిలో పడింది అనసూయ. అయితే ఇప్పుడు పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో గన్ పట్టుకుని షూట్ చేసేస్తానంటోంది.
పీవీపీ బ్యానర్లో రవికాంత్ .పి దర్శకత్వంలో 'క్షణం' అనే ఒక కొత్త సినిమా తెరకెక్కబోతోంది. అడవి శేషు, ఆదాశర్మ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ పోలీసాఫీసర్గా కీలకపాత్రలో నటిస్తోందట. ఈ పాత్ర కోసం ఆమె పోలీసాఫీసర్స్ను దగ్గర్నుంచి గమనించి, ఎంతో హార్డ్ వర్క్ చేసిన తర్వాతే, ఈ క్యారెక్టర్కు ఓకే చేసిందట. రొమాంటిక్, సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో అనసూయకు మంచి పేరు లభిస్తుందని చిత్రయూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
|