సంక్రాంతికి 'సోగ్గాడే చిన్ని నాయనా' అంటూ పండగ వాతావరణాన్ని ఫ్యాన్స్కి పంచిన నాగార్జున ఇప్పుడు 'ఊపిరి' సినిమాతో రానున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జునతో పాటు కార్తీ, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో శ్రియ కీలకపాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నాగార్జున, శ్రియల మధ్య కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగినట్లు సమాచారం. నాగార్జున, శ్రియ కాంబినేషన్లో తెరకెక్కిన 'సంతోషం', నేనున్నాను', 'మనం' చిత్రాలు విజయవంతం అయ్యాయి. దాంతో ఈ సినిమాలో కూడా శ్రియ ఎంట్రీతో సక్సెస్ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాతో విజయాన్ని అందుకున్న నాగార్జున 'ఊపిరి' సినిమాతో మరో విజయాన్ని అందుకోవడానికి రెఢీ అవుతున్నాడు.
ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజెప్పే కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున వీల్ చైర్లో ఉండి, నవ్వులు పండిస్తాడట. రొమాన్స్తో నవ్వులు పూయించిన ఈ మన్మధుడు ఇప్పుడు డిఫరెంట్గా వినోదాన్ని పంచుతానంటున్నాడు. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. మార్చి 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
|