కావలిసిన పదార్ధాలు: పచ్చిరొయ్యలు, గొంగూర, అల్లంవెల్లుల్లి ముద్ద, కారం, పసుపు, ఉప్పు, నూనె, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి
తయారుచేసే విధానం: ముందుగా పచ్చిరొయ్యలను అల్లం వెల్లుల్లి వేసి ఉడకబెట్టాలి. అలాగే గోంగూరను కూడా కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టి గ్రైండ్ చేసి వుంచాలి. తరువాత బాణలిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి ఉడికిన రొయ్యలను వేసి పసుపు, కారం, ఉప్పు వేసి కలిపి ముద్దగా చేసిన గోంగూరను అందులో వేసి 10 నిముషాలు ఉడకనివ్వాలి. అంతే వేడి వేడి గోంగూర పచ్చిరొయ్యలు రెడీ..
|