బుల్లితెరకు యాంకర్స్గా వచ్చి, వెండితెర తెరంగేట్రం కూడా చేసిన యాంకర్స్ అనసూయ, రేష్మీ. బుల్లితెర యాంకర్స్లో హాటెస్ట్ యాంకర్స్గా పేరున్న వీరిద్దరూ పోటా పోటీగా ఇప్పుడు వెండితెరపై కూడా తమ హవా చూపిస్తున్నారు. తాజాగా అనసూయ 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో ఏకంగా నాగార్జునతోనే రొమాన్స్ చేసేసింది. ఇప్పుడు 'క్షణం' అనే రొమాంటిక్ థ్రిల్లర్ మూవీలో పోలీసాఫీసర్ గెటప్లో దుమ్ము లేపడానికి రెఢీ అవుతోంది. ఇదిలా ఉంటే హాట్ అండ్ క్యూట్ భామ రేష్మీ ఏమైనా తక్కువ తిందా? ఆమె హీరోయిన్గా నటించిన 'గుంటూరు టాకీస్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరో పక్క 'రాజు గారింట్లో' అనే ధ్రిల్లర్ మూవీలో హీరోయిన్గా నటిస్తోంది.
ఇలా వీరిద్దరూ వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరో పక్క తమకు లైఫ్ ఇచ్చిన బుల్లితెరను కూడా సమానంగా పంచుకుంటూ అక్కడా, ఇక్కడా కూడా ఏమాత్రం రాజీపడకుండా అవకాశాలు దక్కించుకుంటున్నారు. నిజానికి ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు వెండితెరపై కన్నా, బుల్లితెరపైనే ఎక్కువ గ్లామర్ ఒలకబోస్తున్నారు. తమ గ్లామర్ గురించి ఎవరేమనుకున్నా, ఏ మాత్రం లెక్క చేయకుండా కెరీర్లో దూసుకుపోతున్నారు. ఓ పక్క సినిమాలు, ఇంకోపక్క టీవీ షోస్తో ఈ బ్యూటీస్ క్షణం తీరిక లేకుండా ఉన్నారు.
|