'బ్రూస్లీ' సినిమా తరువాత రామ్ చరణ్ 'తనీ ఒరువన్' రీమేక్లో నటించనున్నాడన్న సంగతి తెలిసిందే. ఎప్పుడో ప్రారంభం కావల్సిన ఈ సినిమా అనేక కారణాల వల్ల లేటయ్యింది. ఎట్టకేలకు ఫిబ్రవరి 18న ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సినిమాకి ముహూర్తం షురూ చేయడం జరిగింది. అల్లు అరవింద్ నిర్మాణంలో, గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతోంది. ఈ నెల 22 నుండి రెగ్యులర్గా షూటింగ్ జరుపుకోనుంది.
సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తరువాత కంటిన్యూస్గా షూటింగ్ జరిపి, వీలైనంత త్వరగా సినిమాను కంప్లీట్ చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా 'బ్రూస్లీ' కాంబినేషన్ రిపీట్ కానుంది. ఆ సినిమాలో చరణ్కి జోడీగా నటించిన రకుల్ ప్రీత్ సింగ్నే ఇందులోనూ హీరోయిన్గా ఎంచుకున్నట్లు సమాచారం. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్లో విలన్గా నటించిన ప్రముఖ తమిళ నటుడు అరవింద్ స్వామినే తీసుకోనున్నారట. 'బ్రూస్లీ' తర్వాత రాబోతున్న ఈ సినిమా చరణ్కు 'మగధీర' సినిమా అంతటి విజయాన్ని అందించనుందని చిత్ర యూనిట్ ఆశిస్తోంది.
|