Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
ramgopalvarma route supperate

ఈ సంచికలో >> సినిమా >>

ఆ పిలుపుకి పులకించిపోయిన సమంత

samanta feel senmentally...

'మనం' సినిమాలో నాగార్జున, సమంతల కాంబినేషన్లో వచ్చే సీన్లు నిజంగా మనసుకు ఎంతో మంచి ఫీల్‌ కలిగిస్తాయి. ఆ సినిమా తర్వాత కూడా అందులోని సీన్స్‌, వారి మధ్య సంభాషణలు సమంతను వెంటాడాయట. అంతగా ఆ పాత్రలో నిమగ్నమయిపోయిందట సమంత. సమంతనే కాదు, నాగార్జున కూడా బయట సెట్స్‌లో కనిపించినపుడు 'అమ్మా..' అని పిలిచేవారట. ఆ పిలుపుకి పులకించిపోయేదట సమంత. ఆ సినిమా నిజంగా తన కెరీర్‌లో ది బెస్ట్‌ అంటోంది ముద్దుగుమ్మ సమంత. మళ్లీ నాగార్జునతో కలిసి నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానంటోంది. సమంత చెప్పింది నూటికి నూరుపాళ్ళూ నిజం. నాగార్జునకు సమంత తల్లిగా నటించడం మామూలు విషయం కాదు. సమంతని నాగార్జున సినిమాలో 'అమ్మా..' అని పిలుస్తోంటే, నాగార్జునని సమంత 'బిట్టూ..' అని పిలుస్తోంటే చూస్తూ పులకించని ప్రేక్షకులుండరు. 'మనం' సినిమా అంత ఘనవిజయం సాధించడం వెనుక తల్లి పాత్రలో సమంత, కొడుకు పాత్రలో నాగార్జున కనబర్చిన నటనా ప్రతిభ కూడా ఓ కారణం. సమంత కెరీర్‌లోనే ది బెస్ట్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చింది 'మనం' సినిమాతో అనడం నిస్సందేహం. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondichooddam