హాటెస్ట్ యాంకర్స్గా పేరు పొందిన అనసూయ, రేష్మిలు ఒక పక్క బుల్లితెరను ఏలుతూనే మరో పక్క వెండి తెరను కూడా ఆక్రమించే ప్రయత్నంలో బిజీ అయిపోయారు. అనసూయ నటించిన 'సోగ్గాడే చిన్ని నాయనా', 'క్షణం' సినిమాలు విజయవంతం కావడంతో ఆమెకు ఆఫర్స్ బాగానే ఉన్నాయి. పాపులారిటీ కూడా బాగా పెరిగింది. ఇక రేష్మి విషయానికొస్తే చాలాకాలం క్రిందట తెలుగు సినిమాల్లో నటించినా, 'జబర్దస్త్' కామెడీ షోతో బుల్లితెరపై స్టార్గా మారి, తిరిగి వెండితెరపైకొచ్చి 'గుంటూర్ టాకీస్' సినిమాతో ఏకంగా హీరోయిన్గా సెటిలై పోయింది.
ఇప్పుడు ఇదే దారిలో మరో హాట్ హాట్ యాంకర్ జయతి కూడా చేరిపోయింది. అప్పట్లో ఒక మ్యూజిక్ ఛానెల్లో 'వెన్నెల' అనే ప్రోగ్రాం ద్వారా యాంకర్గా బాగా పాపులరైన యాంకర్ జయతి. తన డిఫరెంట్ స్టైల్తో ఈ ప్రోగ్రాం ద్వారా చాలా మంది అభిమానుల్ని సంపాదించుకుంది ఈ అమ్మడు. అదే టైంలో 'పార్టీ' అనే సినిమాలో ఒక ఐటెమ్ సాంగ్లో కూడా మెరిసింది. ఇప్పుడు హీరోయిన్గా తెరంగేట్రం చేయనుంది. డైరెక్టర్ ఈశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'లచ్చి' అనే సినిమా ద్వారా ఈ హాటెస్ట్ యాంకర్ హీరోయిన్గా పరిచయం కానుంది. హీరోయిన్కి కావల్సిన అందం ఉన్నప్పటికీ అమ్మడికి ప్రొడక్షన్ చేయడం అంటేనే ఇష్టమనీ, ఫ్యూచర్లో ప్రొడక్షన్ వైపు వెళ్లడానికే తన ఎఫర్ట్ పెడతాననీ చెబుతోంది.
|