గౌతమ్ మీనన్ దర్శకత్వంలో లవ్ స్టోరీస్ అంటే ఆ లవ్లో ఏదో తెలీని ఫీల్, మాయ ఉంటుంది. కథను స్లోగా నడిపిస్తూనే, చూసే ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా ఏదో మాయ చేసేస్తుంటాడు గౌతమ్ మీనన్. ఈ మాంత్రికుడి మాయలోంచి వచ్చిందే నాగచైతన్య, సమంత కాంబినేషన్లో తెరకెక్కిన 'ఏ మాయ చేశావె' సినిమా. ఇప్పుడు మళ్లీ నాగ చైతన్య, గౌతమ్ మీనన్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న కొత్త చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో'. ఈ సినిమాలో నాగ చైతన్యకు జంటగా మంజిమ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది.
మనసుల్ని హత్తుకునే లవ్స్టోరీతో పాటు, ఆట్టుకునే యాక్షన్ సీక్వెన్స్తో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఈ సినిమాపై చైతూ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఆ ఆశలకు తగ్గట్టే సినిమా అద్భుతంగా తెరకెక్కుతోందట. తెలుగు తెరపై ఇదో ఫీల్ గుడ్ మూవీగా ఎప్పటికీ నిలిచిపోతుందని అంటున్నారు. ఈ సినిమాతో చైతూ, తండ్రి నాగార్జునలాగ లవర్ బాయ్ ఇమేజ్ ఇమేజ్ సంపాదించుకోవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడ్తున్నాయి. ఈ నెలాఖరికి ఈ సినిమా ఆడియో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా వచ్చే నెల్లో విడుదల కానుంది.
|