తాజాగా 'గుంటూర్ టాకీస్' సినిమాతో పల్లెటూరి అమ్మాయి పాత్రలో తన అందాలతో కనువిందు చేసింది రేష్మి. అందాల ఆరబోతే కాకుండా నటన పరంగానూ ఈ సినిమా ద్వారా మంచి మార్కులే కొట్టేసింది. ఇప్పుడు అందమైన దయ్యం పాత్రలో భయపెట్టడానికి వస్తానంటోంది రేష్మి. రేష్మి, మధునందన్ ప్రధాన పాత్రల్లో శ్రీ కృష్ణ క్రియేషన్స్ సంస్థ ఒక సినిమా తెరకెక్కిస్తోంది. కామెడీ హారర్ చిత్రాల హవా కొనసాగుతున్న ఈ రోజుల్లో ఈ సినిమా కొత్త ట్రెండ్ సృష్టించబోతోందని డైరెక్టర్ జాని తెలిపారు.
గౌరీ కృష్ణ నిర్మాణంలో తెరకెక్కబోతోన్న ఈ సినిమాలో రేష్మీ నటన ఆకట్టుకునే విధంగా ఉంటుందంటున్నారు చిత్ర యూనిట్. నవ్విస్తూనే భయపెట్టే క్యారెక్టర్లో రేష్మి బాగా నటించిందట. 'గుంటూర్ టాకీస్' సినిమా మాదిరిగా ఈ సినిమా కూడా తనకు మంచి పేరు తీసుకొస్తుందంటోంది రేష్మీ. జూన్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వెండితెరపై ఓ వెలుగు వెలిగి, అవకాశాలు రాక బుల్లితెరకు వెళుతుంటారు కొందరు. అయితే ట్రెండ్ మారింది. బుల్లితెరపై సక్సెస్ అయి, వెండితెరపై వెలిగిపోతున్నారు ఇప్పుడు. మొదట్లో సినిమాలు చేసి, ఆ తర్వాత బుల్లితెరకు వెళ్ళి, బుల్లితెరపై గ్లామరస్ స్టార్ అనిపింకుని, వెండితెరపై వెలిగిపోతోంది రేష్మి. తనకు గుర్తింపునిచ్చిన బుల్లితెరను మర్చిపోకుండా అటు బుల్లితెరనీ, ఇటు వెండితెరనీ తన గ్లామర్తో నింపేస్తున్న రేష్మికి ఆల్ ది బెస్ట్.
|