తెలుగు తెరపై దాదాపు అగ్రహీరోలందరితోనూ నటించినా ఇప్పటికీ యంగ్ హీరోల సరసన క్యూట్గా నటించే గ్లామర్ త్రిష సొంతం. త్రిష పనైపోయిందని అందరూ అనుకున్న టైమ్లో ఆమె తన సత్తా చాటుతుంటుంది. కొన్నాళ్ళుగా త్రిష కెరీర్ స్లో అయిన మాట వాస్తవం. అయితే 'నాయకి' సినిమాతో మళ్ళీ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందట. క్యూట్గా, గ్లామరస్గా కనిపిస్తూనే, హాట్గా రగ్డ్ లుక్తోనూ, భయపెట్టే గెటప్తోనూ ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేయనుంది త్రిష. హర్రర్ జోనర్లో ఇదో కొత్త తరహా చిత్రమని నిర్మాత గిరిధర్ మామిడిపల్లి చెబుతున్నారు. సినీ జర్నలిస్ట్గా కెరీర్ ప్రారంభించి, నటీనటుల డేట్స్ చూసే పీఆర్ఓగా పనిచేసి, నిర్మాతగా ఎదిగారు గిరిధర్. ఈ చిత్రంతో అభిరుచిగల నిర్మాతగా గిరిధర్ పేరు తెచ్చుకుంటారని, 'నాయకి' సినిమా ఫంక్షన్లో నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు. త్రిష అయితే ఈ చిత్రంతో తన కొత్త ఇన్నింగ్స్ ప్రారంభమవుతుందని చెప్పింది.
తెలుగుతోపాటు తమిళంలోనూ ఈ చిత్రాన్ని ఒకేసారి విడుదల చేస్తారు. సినిమా ప్రారంభానికి ముందే టైటిల్ డిజైన్స్తో తెలుగు, తమిళ సినీ ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేసింది 'నాయకి'. ఏదేమైనా 'నాయకి'తో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తానంటున్న త్రిషకీ, 'నాయకి' టీమ్కీ బెస్టాఫ్ లక్.
|