హీరో, హీరోయిన్లలో ఎవరైనా అవకాశం వస్తే ఏ భాషలోనైనా దూసుకెళ్లిపోవాలని అనుకుంటారు. కానీ ముద్దుగుమ్మ రాశీ ఖన్నా మాత్రం తెలుగులో మంచి హీరోయిన్గా పేరు తెచ్చుకోవాలని మాత్రమే అనుకుంటుందట. ఈ అమ్మడికి తెలుగు భాషంటే మక్కువ ఎక్కువన్న మాట. అందుకే తొలి సినిమాతోనే తెలుగులో హీరోయిన్గానే కాకుండా, సింగర్గా కూడా టాలెంట్ చాటుకుంది. ఆ తరువాతి నుంచి కూడా తెలుగులో వరుసగా అవకాశాలు చేజిక్కించుకుంటూ బాగానే తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది. అందుకే ఇంతగా తనను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేంత వరకూ మరో భాష వైపు మొగ్గు చూపనంటోంది బొద్దు భామ రాశీఖన్నా. తాను ఇంత వరకూ చేసిన హీరోలతో మళ్లీ కలిసి నటిస్తోంది.
గోపీచంద్ కొత్త సినిమా 'ఆక్సిజన్'లోనూ, రవితేజ హీరోగా రాబోతున్న సినిమాలోనూ కూడా రాశీనే హీరోయిన్. అంతేకాదు తెలుగులో ముద్దుగా మాట్లాడుతున్న ఈ ముద్దుగుమ్మ ముందు ముందు డబ్బింగ్ చెప్పే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. ఆల్రెడీ ఈ భామ తెలుగులో ఓ పాట కూడా పాడేసింది. 'జోరు' సినిమాలో జోరు జోరుగా పాట పాడేసి, తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది. అతి త్వరలో 'సుప్రీం' సినిమాతో మన ముందుకు రానుంది అందాల రాశి రాశీ ఖన్నా.
|