'గౌరవం' సినిమాతో తెరంగేట్రం చేసిన అల్లువారబ్బాయి అల్లు శిరీష్, మొదటి సినిమాతో అంతగా ఆకట్టుకోలేకపోయినా, రెండో సినిమా 'కొత్త జంట'తో ఫర్వాలేదనిపించాడు. ముచ్చటగా మూడో సినిమా 'శ్రీరస్తు శుభమస్తు' షూటింగ్ దశలో ఉంది. ఈలోగా మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ అల్లు వారబ్బాయ్. ఎం.వి.ఎన్. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఎస్. శైలేంద్రబాబు, కె.వి. శ్రీధర్ రెడ్డి, హరీష్. దుగ్గిశెట్టి నిర్మాణంలో తెరకెక్కబోతోన్న ఈ సినిమాకు సింగిల్ సిట్టింగ్లో శిరీష్ ఓకే చేశాడట.
700 సంవత్సరాల క్రితం జరిగే ఫ్లాష్ బ్యాక్ని తెరపై చూపించే తీరు ప్రేక్షకుల్ని కట్టి పడేసేలా ఉంటుందని డైరెక్టర్ ఎమ్.వి.ఎన్ రెడ్డి తెలిపారు. అలాంటి కథకి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి, ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్గా తెరకెక్కించబోతున్నారట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అది కూడా 700 సంవత్సరాల నాటి ఎపిసోడ్ అంటే, 'మగధీర' సినిమాలోలా ఉంటుందేమోనన్న గుసగుసలు ఇండస్ట్రీలో విన్పిస్తున్నాయి. అదే నిజమైతే గనుక చాలా భారీ ప్రయత్నమే అల్లు శిరీష్ చేస్తున్నాడనుకోవాలి.
|