ప్రస్తుతం నెంబర్వన్ హీరోయిన్గా తెలుగులో హవా చూపుతోంది స్మైలీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. అమ్మడు తాజాగా 'సరైనోడు' సినిమాతో విజయాన్ని అందుకుంది. త్వరలోనే మరోసారి రామ్ చరణ్తో 'తనీ ఒరువన్' రీమేక్లో తళుక్కుమని మెరవనుంది. ఈ చిత్రానికి 'ధృవ' అనే టైటిల్ అనుకుంటున్నారు. రకుల్ ప్రీత్సింగ్కి ఎప్పుడూ చేతినిండా పని ఉండాలట. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క షాపింగ్ మాల్స్ ఓపినింగ్స్ అంటూ జనంలో సందడి చేస్తోంది.
ఇవికాక సేవా కార్యక్రమాలు అంటూ అనాధ పిల్లల కోసం, డొనేషన్లు సేకరిస్తోంది. మొన్నీమధ్యనే మంచు లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో జరుగుతోన్న 'మేము సైతం' అనే రియాలిటీ షో కోసం కూరగాయలు అమ్మి తద్వారా వచ్చిన డబ్బును పేదవారి కోసం డొనేట్ చేసింది. ఇంత బిజీగా ఉన్నా, ఇంకా ఏదో చేసెయ్యాలనే ఆలోచనతో ఉంటుందట రకుల్. పది మంది మెచ్చే పనుల కోసం వెతుకులాట కొనసాగిస్తూనే ఉందట. అబ్బా ఈ ముద్దుగుమ్మది ఎంత విశాల హృదయమో కదా. అందం అంటే దేహాకృతి కాదు.. ఎదుటి వారికి సాయం చేయాలనే ఆలోచనలో ఉంటుంది.. అదే నేను నా తల్లి తండ్రుల నుంచి చిన్నప్పటి నుండీ నేర్చుకున్నది అని నీతి మంత్రాలు కూడా వల్లె వేస్తోంది. అందుకే హ్యాట్సాప్ రకుల్! కీపిట్ అప్.
|