పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రారంభం అయ్యింది. ఏ ఆర్భాటాలూ లేకుండా చాలా సింపుల్గా ఈ సినిమాను ప్రారంభం చేశారు. మంచి ముహూర్తాలు లేని కారణంగా ఈ సినిమాను సింపుల్గా పూజా కార్యక్రమాలతో బుధవారం ప్రారంభించడం జరిగింది. పవన్కి ముహూర్తాలంటే పెద్దగా లెక్కలేకపోయినా, చిత్ర యూనిట్కి ఆ నమ్మకాలుంటాయి కదా. పవన్ కళ్యాణ్కు అత్యంత స్నేహితుడు, 'సర్దార్ గబ్బర్ సింగ్' నిర్మాత అయిన శరత్ మరార్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 'సర్దార్' తర్వాత పవన్ కెరీర్లో వేగం పెంచిందనడానికి ఇదే నిదర్శనం కావొచ్చు. సినిమా షూటింగ్ కూడా చాలా వేగంగా పూర్తి చేయనున్నారట.
పవన్తో 'ఖుషి', 'కొమరం పులి' చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎస్. జె. సూర్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జూన్లో ఈ సినిమా సెట్స్ మీదికెళ్లనుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా స్టోరీ నడుస్తుందని సమాచారం. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లవర్ బోయ్లా మరింత యంగ్గా కనిపించనున్నాడట. ఫ్యాక్షన్ విత్ లవ్స్టోరీగా తెరకెక్కబోతోన్న ఈ చిత్రం 'ఖుషి' సినిమాకి సీక్వెల్గా ఉంటుందని ప్రచారం నడుస్తోంది. పవన్, ఎస్.జె. సూర్య కాంబినేషన్లో వచ్చిన 'ఖుషి' పవన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో కూడా 'ఖుషి' లో ఉన్నంత ఎంటర్టైన్మెంట్ ఉండబోతోందని సమాచారం. వీలైనంత త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు చిత్ర బృందం వెల్లడించనుంది.
|