ఆరడుగుల ఆజానుబాహుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ హీరోగా కొత్త సినిమా పట్టాలెక్కింది. 'మిస్టర్' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నాడు. తొలిసారిగా వరుణ్ తేజ ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో జతకట్టనున్నాడు. 'కుమారి 21 ఎఫ్' ఫేం హెబ్బా పటేల్, 'అందాల రాక్షసి' లావణ్య త్రిపాఠి ఈ చిత్రంలో వరుణ్ తేజ సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
క్టరీ వెంకటేష్,'మిస్టర్' చిత్రానికి తొలి క్లాప్ కొట్టి, సినిమా యూనిట్కి విషెస్ అందించారు. ఆద్యంతం ఎంటర్టైనింగ్గా ఉంటుందనీ, వరుణ్ తేజ ఇమేజ్కి తగ్గట్టుగా క్లాస్ టచ్తో ఉంటూనే, మాస్ని అలరించే అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని దర్శకుడు శ్రీనువైట్ల చెప్పాడు. నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోతోపాటు, హీరోయిన్లకూ నటన పరంగా చాలా స్కోప్ ఉంటుందనీ, వరుణ్తేజలోని కంప్లీట్ ఎనర్జీని ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నామని చిత్ర నిర్మాతలు వెల్లడించారు. 'ముకుంద', 'కంచె', 'లోఫర్' చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తనకు, 'మిస్టర్' కమర్షియల్గా బిగ్ సక్సెస్ అందిస్తుందని వరుణ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
|