నటి సంజనకు చెల్లెలిగా, సునీల్ సరసన హీరోయిన్గా 'కృష్ణాష్టమి' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ముద్దుగ్ముమ్మ నిక్కీ గల్రాని. అక్క కన్నా చెల్లెలు అందంలో, అభినయంలో, డాన్స్ల్లో సూపర్ అంటూ తొలి సినిమాతోనే ప్రశంసలు అందుకుంది ఈ బ్యూటీ గర్ల్. కానీ ఆ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత ఆది పినిశెట్టితో 'మలుపు'తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. ఆ తర్వాత తెలుగులో కొంచెం గ్యాప్ తీసుకుని, తమిళం వైపు దృష్టి పెట్టింది.
ఇంతకుముందే 'డార్లింగ్' సినిమాతో తమిళ్ తంబీలకు సుపరిచితురాతులైన ఈ బొద్దుగుమ్మ, ఇప్పుడు అక్కడ వరుస అవకాశాలతో ఫుల్ బిజీ అయిపోయింది. నిక్కీ నటించిన 'కో 2' చిత్రం ఈ నెల 13న విడుదలకు సిద్ధంగా ఉంది. రాజకీయ నేపధ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నిక్కీ న్యూస్ రిపోర్టర్గా కన్పించనుంది. లారెన్స్ హీరోగా తెరకెక్కుతోన్న మరో చిత్రం 'మొట్టశివ కెట్టశివ' నిర్మాణ దశలో ఉంది. ఇవికాక మరో రెండు సినిమాలు పరిశీలనలో ఉన్నాయి. ఇవి కాక తెలుగులో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో ఏ అవకాశం వచ్చినా వదులుకోనంటోంది నిక్కీ. కన్నడ సినీ రంగం నుంచి దూసుకొచ్చిన ఈ గ్లామరస్ భామకి బాలీవుడ్లో కూఆ అవకాశాలు వస్తున్నాయట.
|