'బ్రూస్లీ' తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం 'ధ్రువ'. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన 'తనీ ఒరువన్' రీమేక్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్కు జోడీగా అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు చాలా వేగంగా జరుగుతున్నాయి.
ఈ సినిమాలో చరణ్ న్యూలుక్తో ఆకట్టుకోనున్నాడు. 'బ్రూస్లీ' తర్వాత రకుల్ ప్రీత్ సింగ్తో మరోమారు రామ్చరణ్ ఈ చిత్రంలో జత కట్టనున్నాడు. రకుల్ పాత్రకు ఈ సినిమాలో మంచి ప్రాధాన్యత ఉందట. చరణ్తో రెండో సారి జతకడుతోన్న ఈ ముద్దుగుమ్మ, సినిమాలో తన పాత్ర చాలా బాగుంటుందనీ, నటిగా తనకు మంచి పేరు తీసుకొస్తుందనీ అంటుంది. తమిళ వెర్షన్లో విలన్గా నటించిన అరవింద్ స్వామి తెలుగులో కూడా విలన్గా నటిస్తున్నాడు. ఓ పక్క మెగాస్టార్ చిరంజీవి 'కత్తి' రీమేక్ చేస్తుండగా, తనయుడు రామ్చరణ్ 'తనీ ఒరువన్' రీమేక్ చేస్తున్నాడు. అటు తండ్రి, ఇటు తనయుడు అభిమానుల్ని బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో అలరిస్తారని ఆశిద్దాం.
|