'హృదయ కాలేయం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కామెడీ హీరో సంపూర్ణేష్బాబు. సినిమా విడుదలకు ముందే సామాజిక మాధ్యమం ద్వారా బోలెడంత మంది అభిమానుల్ని సంపాదించేశాడు ఈ హీరో. స్ఫూప్లనుపయోగించి, టన్నుల కొద్దీ కాపీ స్పూఫ్ డైలాగులు చెప్పేసి విపరీతంగా ఆకట్టుకున్నాడు. తన డైలాగ్ డెలీవరీ, అమాయకపు ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో విశేషంగా ఎట్రాక్ట్ చేశాడు ఈ కామెడీ హీరో. అయితే మన సెన్సేషనల్ హీరోకి ఇప్పుడు అమెరికాలో అవమానం జరిగిందట. అమెరికాలో జరిగే 'ఆటా'(ఎటిఎ) వేడుకలకు టాలీవుడ్ నుండి చాలా మంది సినీ ప్రముఖులకు, నటీ నటులకు ఆహ్వానం అందింది.
అయితే మన క్రేజీ హీరోకి మాత్రం ఈ ఆహ్వానం అందలేదంట. దీనికి కారణం 'ఆటా' వేడుకల నిర్వాహకునికి, సంపూర్ణేష్బాబుకి వేరే కారణాలతో అభిప్రాయ బేధాలు వచ్చాయి. దాంతో ఆయన మన హీరో ఆహ్వానాన్ని కాన్సిల్ చేశారట. వెల్కమ్ లిస్టులో తన పేరు లేనందుకు సంపూ చాలా ఫీలయ్యారట. అంతేకాదు సామాజిక మాధ్యమంలో 'ఆటా' నిర్వాహకుడు సంపూని అనేక దుర్భాషలు ఆడుతూ మెసేజ్ పోస్ట్ చేశాడు. అది ఇప్పుడు సంపూ అభిమానుల్ని కూడా కోపానికి గురి చేస్తోంది. అంతేకాదు ఈ విషయంపై సంపూకి ట్విట్టర్ అభిమానులు ఫుల్ సపోర్ట్గా నిలిచారు. బుల్లితెర యాంకర్ అనసూయ కూడా సంపూర్ణేష్కు జరిగిన ఈ అవమానాన్ని తీవ్రంగా ఖండించింది. తన సినిమాలతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన సంపూకి ఎంత కష్టమొచ్చిందో. అయ్యో పాపం సంపూ!
|