క్రిష్ దర్శకత్వంలో 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాలో నటిస్తున్నాడు బాలకృష్ణ. ఇది బాలకృష్ణకు 100వ చిత్రం. కాగా ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే బాలయ్య మరో సినిమాకు ఓకే చేసేశాడు. 101వ సినిమాకు బోణీ కొట్టేశాడు. కృష్ణ వంశీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నందమూరి హీరోల్లో ఇంత వరకూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కడే కృష్ణ వంశీతో సినిమా చేశాడు. అది కూడా మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. 'రైతు' సినిమాలోనూ కృష్ణవంశీ మంచి మెసేజ్ ఇవ్వబోతున్నాడు.
అలాగే, ఎంటర్టైనింగ్గా సినిమాని తెరకెక్కిస్తాడట కృష్ణవంశీ. 'రైతు' అనే టైటిల్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలయ్య రైతు గెటప్లో కెవ్వుకేక అనిపించేలా నటించనున్నారట. ప్రస్తుతం గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా షూటింగ్లో బిజీగా ఉంటూనే మరో పక్క రాజకీయాల్లోనూ ఎమ్మెల్యేగా తనదైన పాత్ర పోషిస్తున్నారు. ఇంత బిజీగా ఉంటూనే మరో పక్క కొత్త కథలను వినడానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. పెరుగుతున్న వయసును కూడా ఏమాత్రం లెక్క చేయకుండా బాలయ్య సినిమాల మీద చూపిస్తున్న జోరు చూస్తుంటే యంగ్ హీరోలకు ఈర్ష్య పుట్టక మానదు. అలాగే 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమాతో కొడుకు మోక్షజ్ఞను కూడా తెరంగేట్రం చేయిస్తున్నాడు. ఈ సినిమా తన తనయుడికి మంచి ప్లాట్ఫాం అవుతుందని ఆశిస్తున్నాడు బాలయ్య. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కబోయే 'రైతు' సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదికెళ్లనుంది.
|