కావలిసిన పదార్ధాలు:
కంద, బచ్చలి. ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, పసుపు, చింతపండు, వెల్లుల్లిపాయలు, ఉప్పు,
తయారుచేసేవిధానం: ముందుగా కందముక్కలను, బచ్చలికూరను రెండితినీ కుక్కర్లో వేసి, పసుపు, ఉప్పుకూడా వేసి 2 విజిల్స్ వచ్చేవరకూ ఉడికించాలి. తరువాత బాణలిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు వేసి ఉడికిన ఈ మిశ్రమాన్ని బాణలిలో వేయాలి. తరువాత చింతపండు రసాన్ని ఇందులోపోసి బాగా ఉడకనివ్వాలి. చివరగా ఆవాలపొడిని వేసి వెంటనే స్టవ్ కట్టేయాలి. ఈ కందబచ్చలి కార్తీకమాసం లో ప్రత్యేకంగా చేస్తారు..
|