సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించే ఛాన్స్ ముద్దుగుమ్మ రకుల్ని వరించింది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ కోసం టాలీవుడ్ నుండి బాలీవుడ్ దాకా వెతుకులాట కొనసాగింది. బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా ఈ సినిమాలో నటిస్తోందన్న వార్తల నిమిత్తం పెద్ద సెన్సేషనే నడిచింది. కానీ బాలీవుడ్లో సీ గ్రేడ్ హీరోయిన్ అయిన ఈ అమ్మడికి టాలీవుడ్లో సూపర్స్టార్ పక్కన నటించేటంత సీన్ లేదంటూ వచ్చిన వార్తలు కూడా హల్ చల్ చేశాయి. కానీ లాస్ట్ మినిట్లో పరిణీతిని పక్కన పెట్టి రకుల్ని రంగంలోకి దించారు డైరెక్టర్ మురుగదాస్. అయితే రకుల్కి ఇది సూపర్ ఛాన్సే అని చెప్పాలి. ఎందుకంటే 'బ్రహ్మూెత్సవం' సినిమా టైంలోనే కాజల్ ప్లేస్లో రకుల్ నటించాల్సి ఉంది. కానీ అప్పట్లో డేట్స్ అడ్జస్ట్ కాక ఈ ఛాన్స్ రకుల్ వదులుకుందన్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు వచ్చిన ఈ ఛాన్స్ కూడా తనకున్న బిజీ షెడ్యూల్స్తో వదులుకోవాల్సి వస్తుందనే గుసగుసలు కూడా వినిపించాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని ఖండిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజతో ఒక సినిమా చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. ఆ సినిమా కోసం ఈ సినిమాను వదులుకుంటుందేమో అని భావించారంతా. కానీ తన డేట్స్ని రెండు సినిమాలకూ అడ్జస్ట్ చేసుకుంటాను కానీ సూపర్స్టార్తో ఛాన్స్ మాత్రం అస్సలు వదులుకోనంటోంది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.
|