కొరటాల శివతో మహేష్ బాబు చేసిన 'శ్రీమంతుడు' సూపర్ హిట్ అయ్యింది. రికార్డు స్ధాయిలో భారీ వసూళ్లను తెచ్చిపెట్టింది. వసూళ్లను తెచ్చిపెట్టడమే కాకుండా, ఊరు దత్తత అనే కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఎంతో మందికి స్ఫూర్తి దాయకం అయ్యింది. ఈ సినిమా తర్వాత మహేష్తో పాటు, చాలా మంది గొప్ప వ్యక్తులు తమ తమ ఊరిని బాగుచేసుకునే దిశగా తమ అడుగులు వేశారు. ఇలా ఇంత గొప్ప సెన్సేషన్ని మహేష్కి అందించిన ఘనత కొరటాలకే దక్కిందనడంలో అతిశయోక్తి లేదు.
ఈ సినిమాతో కేవలం మహేష్కే కాదు కొరటాల కూడా ఈ సినిమా తరువాతే స్టార్ డైరెక్టర్స్ రేంజ్కి ఎదిగిపోయాడు. అయితే, 'శ్రీమంతుడు' సినిమాతో భారీ సక్సెస్ని అందుకున్న సూపర్స్టార్ 'బ్రహ్మూెత్సవం' రూపంలో బిగ్ ఫెయిల్యూర్ని చవి చూడక తప్పలేదు. ప్రస్తుతం కొరటాల - ఎన్టీఆర్తో 'జనతా గ్యారేజ్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత కొరటాల సినిమా మహేష్తోనే అని తెలుస్తోంది. ఈ సినిమాకు డి.వి.వి.దానయ్య, ఠాగూర్ మధు నిర్మాతలుగా వ్యవహరిస్తారు. మహేష్ - మురుగదాస్ కాంబినేషన్లో ఒక సినిమా తెరక్కెబోతోంది. మహేష్ కాస్త అటూ ఇటూగా ఒకేసారి ఈ రెండు సినిమాల్లోనూ నటించే అవకాశాలున్నట్లు సమాచారం. అంటే వచ్చే ఏడాది ఈ రెండు సినిమాలను రెండు మూడు నెలల గ్యాప్లో విడుదల చేయాలని మహేష్ భావిస్తున్నాడట. ఏదేమైనా కొరటాల శివతో సినిమా అంటే మహేష్ ఇంకో బ్లాక్ బస్టర్కి రెడీ అయిపోవచ్చు.
|