'గౌరవం' సినిమాతో తెలుగు తెరపై గ్రాండ్ ఎంట్రీ ఇద్దామనుకున్నా అల్లు శిరీష్కి తొలి చిత్రం ఆశించిన విజయాన్ని ఇవ్లఏదుగానీ, గుర్తింపు అయితే తెచిచంది. ఆ తరువాత 'కొత్త జంట'తో ఫర్వాలేదనిపించాడు. ఇప్పుడు 'శ్రీరస్తు శుభమస్తు' అని మనస్పూర్తిగా దీవించమని అడుగుతున్నాడు. పరశురామ్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ నెల 31న విడుదలకు రెఢీ అయ్యింది. ఈ సందర్భంగా బుధవారం ఈ సినిమా ఆడియోలోని ఒక పాటను అల్లు అరవింద్ విడుదల చేశారు. డిఫరెంట్గా ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ని ప్లాన్ చేశారు. ఒక్కోరోజూ ఒక్కొక్క పాటను విడుదల చేస్తూ, ఆడియో ఫంక్షన్లోని వినూత్న పద్ధతికి తెర లేపాలని నిర్ణయించుకున్నాం అంటూ నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. అందాల భామ లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకునే కధాంశాలు ఎక్కువ ఉన్న ఈ చిత్రంలో కొత్తగా సాగే లవ్ ట్రాక్ కూడా ఉంది. ఈ సినిమాలో అల్లు శిరీష్ హ్యాండ్సమ్ లుక్స్తో ఆకట్టుకోనున్నాడు. డిఫరెంట్ స్టైల్లో ఆకట్టుకునే మ్యూజిక్ని అందించాడు తమన్ ఈ సినిమాకి. తమన్ బీట్స్కి తగ్గట్లుగా శిరీష్ కష్టపడి డాన్సులు చేశాడు. ఈ సినిమా కోసం ప్రత్యేకించి డాన్సుల్లో శిక్షణ తీసుకుని మరీ చిందేశాడు ఈ అల్లు వారబ్బాయ్. ఈ సినిమా సక్సెస్ అయితే ఈ అల్లు వారి బుల్లోడు హీరోగా నిలదొక్కుకున్నట్లే. అరవింద్ నిర్మాణంలో గీతాఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా రూపొందింది.
|