కొంత కాలం గ్యాప్ తర్వాత శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం సెట్స్ మీదకు వెళ్ళింది. వరుణ్తేజ ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండగా, మలయాళ భామ సాయి పల్లవి ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. అమెరికా అబ్బాయి, తెలంగాణ అమ్మాయి.. ఇద్దరి మధ్యా ప్రేమ అనే కాన్సెప్ట్తో ఈ చిత్రం రూపొందనుంది. సున్నితమైన భావోద్వేగాలతోపాటు, అందమైన ప్రేమకావ్యంగా ఈ చిత్రాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించనున్నాడట. శేఖర్ కమ్ముల సినిమాల్లో ఫీల్, నేచురాలిటీ, లైవ్లీ లుక్ అందరికీ అనుభవమే.
ఎన్నో అంచనాలతో 'అనామిక' సినిమా చేసి చేదు ఫలితాన్ని చవిచూసిన శేఖర్ కమ్ముల, కాస్త గ్యాప్ తీసుకుని ఈ జనరేషన్కి తగ్గ కథాంశంతో, యూత్ని ఎట్రాక్ట్ చేయడంతోపాటు ఆలోచింపజేసే అంశాలతో ఈ కొత్త కథను తయారుచేసుకున్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, ఓ ప్రముఖ నటుడు, ఓ ప్రముఖ నటి ఇందులో ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారని తెలియవస్తోంది. 'ఫిదా' అనే టైటిల్ని శేఖర్ కమ్ముల పరిశీలిస్తున్నారట. సినిమా షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలోనూ, తెలంగాణలోనూ జరుగుతుంది. అమెరికా, తెలంగాణ మధ్య ప్రేమాయణమే అయినా, యూనివర్సల్ అప్పీల్ ఉన్న సబ్జెక్ట్ అని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
|