కొన్ని అనివార్య కారణాలతో మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ హీరోగా నటిస్తున్న చిత్రం సెట్స్ మీదకు వెళ్ళేందుకు మొహమాటపడింది. కానీ అన్నీ ప్లాన్డ్గా ప్రిపేర్ చేసుకుని, షూటింగ్ శరవేగంగా జరపడం కోసమే ఆ ఆలస్యం అని ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోంది. మురుగదాస్ అంటే పెర్ఫెక్షన్ని కోరుకుంటాడు. అందుకే అన్నీ సమకూర్చుకున్నాక సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్ళాడు. సూపర్ స్టార్ మహేష్ కూడా అంతే. సినిమా ఒక్కసారి పట్టాలెక్కిందంటే, తన స్పీడ్తో సినిమాకి మరింత వేగాన్ని తీసుకొచ్చేస్తాడు. చకచకా ఓ పాట, ఓ ఫైట్ని ఇప్పటికే పూర్తి చేసేశారంటే మహేష్, మురుగదాస్ ఎంత స్పీడ్గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
పూర్తిస్థాయి స్క్రిప్ట్ ఉంటే తప్ప మురుగదాస్ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్ళడు. అంతా పక్కాగా ఉండటంతో ఇద్దరూ కలిసి సినిమాని పరుగులు పెట్టించేస్తున్నారట. ఆ వేగం చూసి యూనిట్ వర్గాలే షాక్కి గురవుతున్నాయి. కెమెరా, షాట్ ఓకే అన్న మాటలు తప్ప వన్ మోర్ టేక్ అన్న మాటలు వినిపించడంలేదట. మహేష్ సినిమా అంటేనే అంత. సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చేలా ఈ చిత్రం రూపొందుతోంది. రకుల్ ప్రీత్సింగ్ ఈ చిత్రంలో మహేష్ సరసన హీరోయిన్గా నటించనుంది. తమిళ దర్శకుడు ఎస్జె సూర్య ఈ చిత్రంలో విలన్గా నటిస్తున్నాడు.
|