నేచురల్ బ్యూటీ హెబ్బా పటేల్ కొత్త సినిమాకి కమిట్ అయ్యింది. నాగ అన్వేష్ హీరోగా బాహుబలి పళని దర్శకత్వంలో రూపొందనున్న 'ఏంజెల్' సినిమాలో హీరోయిన్గా ఎంపికైంది హెబ్బా పటేల్. సుకుమార్ నిర్మాణంలో వచ్చిన 'కుమారి 21ఎఫ్'తో హెబ్బా పటేల్ పేరు తెలుగు సినీ పరిశ్రమలో మార్మోగిపోయింది. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇంకో వైపున వరుస అవకాశాలతో ఈ భామ దూసుకుపోతోంది. పలువురు యంగ్ హీరోలకి హెబ్బా పటేల్ బెస్ట్ ఆప్షన్గా మారింది. '
ఏంజెల్' సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో ఎంజెల్లా హెబ్బా పటేల్ని చూపించనున్నాడట దర్శకుడు బాహుబలి పళని. భువనసాగర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కామెడీ ఎంటర్ టైనర్గా సినిమా ఉంటుందనీ, అలాగే యూత్నీ, ఫ్యామిలీ ఆడియన్స్నీ ఎట్రాక్ట్ చేసే అన్ని అంశాలూ సినిమా మెండుగా ఉంటాయని చిత్ర దర్శక నిర్మాతలు చెప్పారు. ఈ సినిమాతో హెబ్బా పటేల్లోని కొత్త యాంగిల్ని చూపించబోతున్నారట. అదేంటో తెరపై చూస్తేనే బాగుంటుంది. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ ఈ చిత్ర ప్రారంభోత్సవానికి హాజరై, తొలి క్లాప్ కొట్టాడు. సినిమా ఘనవిజయం సాధించాలని, సినిమా యూనిట్కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు సాయిధరమ్ తేజ. సినిమా ప్రారంభోత్సవానికి హాజరైన పలువురు సినీ ప్రముఖులూ 'ఏంజెల్' సినిమా విజయవంత కావాలని ఆకాంక్షించారు.
|