మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా తెరకెక్కించడం చాలా పెద్ద బాధ్యత. సుదీర్ఘ విరామం తర్వాత చిరంజీవి చేస్తున్న సినిమా ఇది. ఆ బాధ్యతను రామ్చరణ్ తన భుజానికెత్తుకున్నాడు. అంతే కాకుండా ఇంకో వైపున సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'ధృవ' సినిమాలో హీరోగా రామ్చరణ్ నటిస్తున్నాడు. ఒకేసారి రెండు పడవల మీద ప్రయాణం అంటే ఇదే. ఓ పక్క తండ్రి చిరంజీవి సినిమా నిర్మాణ వ్యవహారాల్ని చూసుకోవాలి, ఇంకో వైపున తన సినిమా షూటింగ్లో పాల్గొనాలి.
ఈ రెండు బాధ్యతల్నీ చరణ్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడట. 'ధృవ' సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. రామ్చరణ్, రకుల్ గతంలో 'బ్రూస్లీ' సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాడు రాంచరణ్. ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ఆగష్టు 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ని విడుదల చేయాలనుకుంటున్నారట. ఇకపోతే సెప్టెంబర్ 2న ఆడియో విడుదల చేసే యోచనలో ఉన్నారట. సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆ రోజే ఈ సినిమా టీజర్ని విడదల చేస్తారు. ఇంకో వైపున చిరంజీవి పుట్టినరోజునాడు చిరంజీవి హీరోగా రూపొందుతున్న సినిమా ఫస్ట్ లుక్ ప్లాన్ చేశారని సమాచారమ్. అదే రోజు టైటిల్ కూడా అనౌన్స్ చేయనున్నారట. ఏదేమైనా రామ్చరణ్ ప్లానింగ్ అద్భుతం అనిపిస్తోంది.
|