నాగ చైతన్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా కాలమే అయ్యింది. లేట్ అయినా చాలా లేటెస్ట్గా వస్తానంటున్నాడు నాగ చైతన్య. చందు మొండేటి దర్శకత్వంలో వస్తోన్న చైతూ సినిమా 'ప్రేమమ్'. కూల్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. హాట్ హాట్ స్టార్ శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. చైతూకి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుంది అని చిత్ర యూనిట్ భావిస్తోంది. సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రాణంలాంటిది. గోపీ సుందర్ డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమా పాటలు విడుదల కార్యక్రమం మొదలైంది. 'ఎవరే ప్రేమను మాయంది' అనే పాటను గురువారం విడుదల చేశారు. చైతూ ఎంతో ఫీలయ్యి చేసిన సినిమా ఇది. లవర్ బోయ్గా తన స్థానాన్ని ఈ సినిమాతో మరింత పటిష్టం చేసుకుంటాడు చైతూ అంటున్నారు. శృతి హాసన్తో పాటు ఈ సినిమాలో మరో ఇద్దరు ముద్దుగుమ్మలు 'అ,ఆ..' ఫేం అనుపమా పరమేశ్వరన్, మడొన్నా సెబాస్టియన్లు చైతూతో రొమాన్స్ చేయనున్నారు. ఈ సినిమా వచ్చే నెల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాక చైతూ మరో సినిమా 'సాహసం శ్వాసగా సాగిపో' కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. రెండు సినిమాలూ దాదాపుగా ఒకేసారి సిద్ధమైపోయాయి. దాంతో దేన్ని ముందుకు తీసుకురావాలా? అన్న సంశయంలో ఉన్నాడట హీరో నాగచైతన్య. ఏది వచ్చినాసరే సక్సెస్ ఖాయమనే ధీమా నాగచైతన్యలో కనిపిస్తోంది. సో ఆల్ ది బెస్ట్ టు చైతూ.
|