ఎప్పుడు రూపొందిందో, ఎప్పుడు విడుదలకు సిద్ధమయ్యిందో తెలియకుండా అనూహ్యంగా విడుదల డేట్ని అనౌన్స్ చేసుకుని, తెలుగు సినీ పరిశ్రమను ఆశ్చర్యపరిచిన చిత్రం 'రాజుగారి గది'. ఎవరి అంచనాలకూ అందకుండా అద్భుత విజయాన్ని అందుకున్న ఈ చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారు. బుల్లితెర వ్యాఖ్యాతగా సుపరిచితుడైన ఓంకార్ ఈ చిత్రానికి దర్శకుడు. 'రాజుగారి గది' సీక్వెల్ తీస్తున్నట్లు వెల్లడించిన ఆయన, మొదటి సినిమా కన్నా రెండో సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇంకా ఎక్కువ ఉంటాయని చెప్పాడు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పివిపి ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకునేందుకు ముందుకు రావడంతో 'రాజుగారి గది' సీక్వెల్పై ఇప్పటికి ఉన్న అంచనాలు ఒక్కసారిగా వంద రెట్లు పెరిగాయనడం నిస్సందేహం.
ఓ ప్రముఖ హీరోయిన్ ఇందులో ముఖ్య పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలి సినిమాని చిన్న నటీనటులతో తీసేసిన ఓంకార్, సీక్వెల్ కోసం మాత్రం భారీ తారగణాన్ని ఎంచుకోనున్నాడట. భారీ బడ్జెట్తో ఈ చిత్రం రూపొందనుంది. అతి త్వరలోనే ఈ చిత్ర విశేషాల్ని దర్శకుడు ఓంకార్, నిర్మాతలు వెల్లడిస్తారు. సీక్వెల్ అనౌన్స్ చేయగానే, మంచి బిజినెస్ ఆఫర్స్ ఈ చిత్రానికి అప్పుడే వస్తున్నాయట. 'రాజుగారి గది' ఇచ్చిన సక్సెస్ కిక్తో ట్రేడ్ వర్గాల్లో ఈ చిత్రం పట్ల ఆసక్తి అంతలా పెరిగింది. సీక్వెల్తోనూ హిట్టు కొట్టి 'రాజుగారి గది' టైటిల్ని ఓ బ్రాండ్గా మార్చేసి, ఆ సిరీస్లో ఓంకార్ మరిన్ని చిత్రాల్ని తీసుకురావాలని ఆశిద్దాం.
|