కళ్యాణ్రామ్ కొత్త సినిమా 'ఇజం' పేరులోనే పవర్ కనిపిస్తోంది. పూరీ జగన్నాధ్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో అదితి ఆర్య కథానాయికగా తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్రామ్ 'ఇజం' చిత్రాన్ని నిర్మించారు. జర్నలిస్టు పాత్రలో కళ్యాణ్రామ్ కొత్త తరహా హీరోయిజం ప్రదర్శిస్తాడట. గతంలో పవన్ కళ్యాణ్తో ఈ తరహాలో చిత్రాన్ని చేశాడు డైరెక్టర్ పూరీ. అదే 'కెమెరామెన్ గంగతో రాంబాబు'. మళ్లీ ఇప్పుడు కళ్యాణ్రామ్తో ఆ తరహా పాత్ర పూరి చేయిస్తున్నాడు. 'ఇజం' కంటెన్ట్ అంతా చాలా పోజిటివ్ వెర్షన్లో చూపించాడట పూరీ.
ప్రతీ ఒక్కరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అవుతుందంటున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్రామ్ రెండు డిఫరెంట్ లుక్స్లో కనిపిస్తాడట. అనూప్ రూబెన్స్ ఆకట్టుకునే సంగీతాన్ని అందించారు. ఆడియోకి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. 'పటాస్'తో కళ్యాణ్రామ్ సూపర్ హిట్ అందుకున్నాడు. అలాంటి విజయం మళ్లీ ఈ సినిమాతో దక్కుతుందని అంచనా వేస్తున్నారు. కళ్యాణ్రామ్కి ఈ సినిమా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమా కోసం పూరీ స్వయంగా ఒక పాటను రాయడమే కాకుండా సొంత గొంతుతో ఆలపించడం ఈ సినిమాలో మరో విశేషం. ఇటీవల నందమూరి హీరో ఎన్టీయార్తో 'టెంపర్' సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్న పూరి, ఈసారి నందమూరి కళ్యాణ్రామ్తో 'ఇజం' సినిమా ద్వారా మరో సెన్సేషనల్ హిట్కి రెడీ అయిపోయాడన్నది నిస్సందేహం.
|