మధురా శ్రీధర్ దర్శకత్వంలో కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కబోతోందట. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ మూవీగా ఈ సినిమా రూపొందనుందట. అయితే కేసీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీయాలనే ఆలోచన వచ్చినందుకు తెలంగాణా ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణా ఉద్యమం నేపధ్యంలో ఇంతవరకూ చాలా సినిమాలు తెరకెక్కాయి. అవి అంతగా ఆదరించబడలేదు. ఇంకా ఎన్నో తెలంగాణా కథల్ని తెరకెక్కించాలనే ప్రయత్నాలు కూడా జరిగాయి కానీ అవి కూడా కార్యరూపం దాల్చలేదు.
అయితే తొలిసారిగా కేసీఆర్ బయోపిక్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో కేసీఆర్ 'జై బోలో తెలంగాణా' సినిమాకి కేసీఆర్ ఒక పాట రాశారు. ఇప్పుడు రాబోతున్న ఈ సినిమాకి ఇంకేం స్పెషల్ చేస్తారో చూడాలి. రాజ్ కందుకూరి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుందట. వచ్చే ఏడాది జూన్లో ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లే యోచనలో ఉంది చిత్ర యూనిట్. 2018 ఫిబ్రవరిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని తెలియవస్తోంది. తెలంగాణా ఉద్యమానికి కేసీఆర్ చేసిన కృషి దగ్గర్నుంచీ, తెలంగాణా ఏర్పాటు, తెలంగాణా రాష్ట్రానికి తొలి సీఎంగా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించడం వరకూ వివిధ దశల్ని ఎంతో అద్భుతంగా ఈ సినిమాలో చూపించనున్నారట.
|