క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాలో నటిస్తున్నారు. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం బాలయ్యకు 100వ చిత్రం. శ్రియ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. హేమా మాలిని బాలకృష్ణకు తల్లిగా కీలక పాత్ర పోషిస్తోంది. సంక్రాంతి బరిలో ఈ సినిమాను ఉంచేందుకు క్రిష్ అండ్ టీం రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా సెట్స్ మీదుండగానే బాలయ్య తన నెక్స్ట్ మూవీని ఎప్పుడో అనౌన్స్ చేసేశాడు. అదే కృష్ణవంశీ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న 'రైతు' సినిమా. ఇది కూడా బాలయ్యకు ఎంతో ప్రత్యేకం.
ఎందుకంటే ఇది రాజకీయ నేపధ్యం ఉన్న సినిమా కావడం విశేషం. అంతేకాదు ఈ సినిమాకు కూడా బాలీవుడ్ ఫ్లేవర్ అద్దనున్నాడు బాలయ్య. 'శాతకర్ణి'లో బాలీవుడ్ బ్యూటీ హేమామాలిని నటిస్తే, ఈ సినిమాలో ఏకంగా బిగ్బీ అమితాబ్ బచ్చనే నటిస్తుండడం విశేషం. అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నారని సమాచారమ్. దాదాపుగా ఆ పాత్రకు బిగ్బీ ఓకే అన్నారని కూడా తెలుస్తోంది. 'శాతకర్ణి' సినిమా పూర్తి కాగానే బాలయ్య ఈ సినిమాని సెట్స్ మీదికి తీసుకెళ్లనున్నారట. అరటే బాలయ్య యంగ్ హీరోలతో పోలిస్తే, సూపర్ ఫాస్ట్గా ఉన్నారని చెప్పవచ్చు. ఒక సినిమాతో బిజీగా ఉన్నప్పుడే మరో సినిమాని కూడా లైన్లో పెట్టేయడమే కాకుండా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు.
|